Srinivasa Mangapuram Trailer Out
సూపర్స్టార్ కృష్ణ వారసత్వం నుంచి మరో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న జై కృష్ణ ఘట్టమనేని నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అవుతుండగా, మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, టీజర్తో ఆసక్తి రేపిన ఈ సినిమా… తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్తో అంచనాలను మరింత పెంచేసింది.
Srinivasa Mangapuram Trailer Out
ట్రైలర్ చూస్తే ఇది కేవలం ఓ ప్రేమకథ మాత్రమే కాదని, ప్రేమ కోసం పోరాడే ఇద్దరు యువకుల భావోద్వేగ ప్రయాణమని స్పష్టంగా అర్థమవుతోంది. శ్రీను- మంగా ప్రేమను అందంగా చూపించిన దర్శకుడు, అదే సమయంలో బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబును చూపించిన తీరు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్తో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. హీరోగా తొలి సినిమానే అయినా జై కృష్ణ ఘట్టమనేని స్క్రీన్పై చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో సహజమైన నటనతో ఆకట్టుకుంటూనే, యాక్షన్ ఎపిసోడ్స్లో మంచి ఇంటెన్సిటీ చూపించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ హీరోగా మంచి భవిష్యత్తు ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. రాషా థడానీ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించింది. జై కృష్ణతో ఆమె కెమిస్ట్రీ ట్రైలర్కు ప్రధాన బలంగా నిలిచింది. ఇక మోహన్ బాబు కనిపించిన ప్రతి షాట్కు ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉంది. ఆయన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కథలో సంఘర్షణను మరింత బలంగా చూపించింది. టెక్నికల్గా కూడా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. జయకృష్ణ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ను రిచ్గా చూపించగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు అదనపు బలం ఇచ్చింది. మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్ ట్రైలర్ను షార్ప్గా ప్రజెంట్ చేయగా, సాహి సురేష్ రూపొందించిన ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు గ్రాండ్ విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది.
విజయవాడలో ఘనంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో జై కృష్ణ భావోద్వేగంగా మాట్లాడారు. తన తాత సూపర్ స్టార్ కృష్ణ, బాబాయ్ మహేష్ బాబు తనకు ఎప్పుడూ అండగా నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభూతిని ఇస్తుందని, జూలై 30న ప్రతి ఒక్కరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరారు.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ… జై కృష్ణ తొలి సినిమా హీరోలా ఎక్కడా కనిపించలేదని ప్రశంసించారు. మహేష్ బాబుకు ట్రైలర్ పంపగా “సూపర్” అంటూ నాలుగు లవ్ ఎమోజీలతో స్పందించారని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా అభిమానులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రత్యేక చిత్రం అని ఆయన తెలిపారు.
హీరోయిన్ రాషా థడానీ తెలుగు సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని చెబుతూ, ప్రేక్షకులు జూలై 30న థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని కోరారు.
మొత్తంగా చూస్తే… ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్తో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరోగా జై కృష్ణకు ఇది బలమైన ఆరంభం అవుతుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.