మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబో మూడేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ సక్సెస్ను అందుకోగా, రీసెంట్గా వీరి కాంబోలో మరో మూవీని అనౌన్స్ చేశారు. భారీ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కనుంది. మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ చిత్రానికి ‘‘కాకాజీ”అనే పవర్ఫుల్ టైటిల్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. “కాకాజీ” అనే టైటిల్ చూస్తేనే ఒక మాస్, రూటెడ్ క్యారెక్టర్ను సూచిస్తోంది. సామాన్యుడి నుండి అసాధారణ వ్యక్తిగా ఎదిగే వ్యక్తి కథగా ఈ సినిమా ఉండొచ్చని టాక్. బాబీ స్టైల్లో ఎమోషన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్ని కలిపిన ప్యాకేజ్గా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి పూర్తిగా డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారనే వార్తలు ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతున్నాయి. గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా, మరింత రఫ్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్లో కనిపించవచ్చని సమాచారం.
కేవీఎన్ ప్రొడక్షన్స్ అంటే భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ టీమ్ అనేది తెలిసిందే. ఈ చిత్రానికి కూడా అదే స్థాయి ప్లానింగ్ జరుగుతుందట. పాన్-ఇండియా రేంజ్లో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినిపిస్తోంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విషయంలోనూ టాప్ టెక్నీషియన్స్ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. బాబీ సినిమాల్లో మ్యూజిక్ ఎంత కీలకమో తెలిసిందే. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్పై అధికారిక అనౌన్స్మెంట్ రాకపోయినా, త్వరలోనే గ్రాండ్గా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టైటిల్, ఫస్ట్ లుక్తోనే పెద్ద హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి, బాబీ కాంబోలో “కాకాజీ” అనే టైటిల్తో సినిమా వస్తే, అది కచ్చితంగా మాస్, క్లాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి త్వరలో ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిరంజీవి హీరోగా రూపొందుతునవ్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ వర్క్లో జాప్యంతో ఆలస్యమైంది. జులై 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కునాల్ కపూర్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






